బైంసా, డిసెంబర్ 10 : ఒకప్పుడు అన్నీ సి జేరియన్ ప్రసవాలే. సాధారణ కాన్పుల మాటే వినిపించలేదు. ఈ క్రమంలో కోతలను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని రాష్ట్ర ప్రభు త్వం భావించింది. దీంతో ప్రభుత్వ దవాఖాన లో సాధారణ కాన్పులపై దృష్టి పెట్టింది. గత సంవత్సరంతో పోలిస్తే సిజేరియన్ డెలివరీల రేటు చాలా తగ్గిందని వైద్యాధికారుల గణాంకా లు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేపట్టిన సంస్కరణల కారణంగా సిజేరియన్ డెలవరీల రేటు బాగా తగ్గింది. జ్యోతిష్యం ఆధారంగా ప్ర సవాలను ఇష్టపడే గర్భిణులు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వం ప్రత్యేకంగా చ ర్యలు చేపట్టింది.
దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అంటే ఆందోళన చెందే రోజులు మారా యి. ప్రస్తుతం ప్రైవేట్ కంటే సర్కారు ద వాఖానలకు ప్రసూతి కోసం వచ్చే వారి గణనీయంగా పెరిగింది. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు సాధారణ ప్రసవాలతో కలిగే ప్రయోజనాలు వివరిస్తూ వాటిని మరింత పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాన్పు కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళితే రూ.వేలల్లో ఖర్చుతో పాటు సిజేరియన్ చేయడానికే ఎక్కువగా వైద్యులు ప్రాధాన్యమిస్తారు. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుం ది. ఈ క్రమంలో సర్కారు దవాఖానల్లో నార్మ ల్ డెలివరీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిం ది. దీంతో సాధారణ ప్రసవాలకే వైద్య సిబ్బంది మొదటి ప్రాధాన్యం ఇస్తుండడంతో భైంసా ఏరి యా దవాఖానకు వచ్చే వారి సంఖ్య కూడా పె రుగుతున్నది. ఇక్కడ ప్రతిరోజూ 300 నుంచి 400 మంది ఓపీ కోసం వస్తున్నారు.
దాదాపు 5 నుంచి 7 వరకు సహజ ప్రసవాలు చేస్తున్న ట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన నెలకు సుమారు 80 నుంచి 100 వ రకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడికి ముథోల్ నియోజకవర్గంతో పాటు మ హారాష్ట్ర నుంచి ప్రసూతి కోసం గర్భిణులు ఇక్కడికి వస్తున్నారు.
మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో పాటు సాధారణ ప్రసవాలు చేసేలా వైద్యులు, సిబ్బంది చొరవ చూపుతున్నారు. దీంతో దవాఖానకు వచ్చే గర్భిణుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దవాఖానలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రసవాలకు వచ్చే మహిళలకు వైద్యులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. సలహాలు, సూచనలు, అందుతున్న చికిత్సతో దూర ప్రాంతాల నుంచి సాధారణ ప్రసవాలకు తరలి వస్తున్నారు.
భైంసా ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోజురోజుకూ సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. తప్పని పరిస్థితుల్లో తప్ప ఎక్కువ శాతం సాధారణ కాన్పులకే ప్రాధాన్యమిస్తున్నాం. ప్రతిరోజూ 300 నుంచి 400 మంది వరకు ఓపీ చూయించుకుంటున్నారు. దీనికితోడు 5 నుంచి 7 మంది గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేస్తున్నాం. ఈ లెక్కన నెలకు 80 నుంచి 100 వరకు నార్మల్ డెలివరీలే అవుతున్నాయి. వీటితో తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారు.
– డాక్టర్ కాశీనాథ్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్, భైంసా