పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని చూసి పట్టం కట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలను కోరారు. బుధవారం ఊరూరా బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది.
కార్యకర్తలు, నాయకులు గులాబీ జెండాలు చేతబూని ర్యాలీలు తీస్తూ హోరెత్తిస్తున్నారు. సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే.. అండగా ఉంటామంటూ అభయమిస్తున్నారు.
ఇక ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న, సోనాలలో బోథ్ అభ్యర్థి జాదవ్ అనిల్ , సారంగాపూర్ మండలంలో అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తానూర్ మండలంలో ముథోల్ అభ్యర్థి విఠల్ రెడ్డి రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించారు. అభివృద్ధిని చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరారు.