సోన్, ఆగస్టు 3 : ఆయిల్పామ్ సాగు ఎంతో లాభదాయకమని, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నదని రాష్ట్ర ఆయిల్పామ్ కన్సల్టెంట్ బీఎన్ రావు అన్నారు. బుధవారం సోన్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గంలోని ఆయిల్పామ్ రైతులకు సాగు విధానంపై అవగాహన కల్పించారు. అతివృష్టి, అనావృష్టి ఏర్పడినప్పుడు సంప్రదాయ పంటల్లో తీవ్ర నష్టాలు వస్తున్నాయని, ఆయిల్పామ్ సాగుతో ఆ సమస్య ఉండదన్నారు. ఒక్కసారి సాగు చేస్తే ఎనిమిదేండ్ల పాటు నిరంతర ఆదాయం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం బిందు సేద్యం, తుంపర్ల సేద్యం పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నదని వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది 12వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులు పేర్లను నమోదు చేసుకున్నారని, వారందరికీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక నిపుణుడు అనంత్రావు, శేఖర్, ఏడీహెచ్ శరత్బాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్రెడ్డి, సర్పంచ్ టీ.వినోద్, ఉద్యానశాఖ అధికారులు ఫాతిమా, ప్రణీత్, ఆయిల్పామ్ సీడ్ జిల్లా ఇన్చార్జి సుబ్బారావు, ఏఈఓ అంబాజీ, రైతులు పాల్గొన్నారు.