నార్నూర్, జనవరి 30 : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రచారం చేయాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గాదిగూడలోని రైతు వేదికలో ఎంపీపీ ఆడ చంద్రకళారాజేశ్వర్ అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జడ్పీచైర్మన్ హాజరయ్యారు. అధికారులు తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు లేవనెత్తిన సమస్యలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాలన్నారు. ప్రతి సమస్యను ఎమ్మెల్యేతో కలిసి పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ అధికారులు ఫీల్డ్ పర్యవేక్షణను అలవర్చుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ మెస్రం గంగుబాయి, వైస్ఎంపీపీ యోగేశ్, ఎంపీడీవో సాయిప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ కనక యాదవ్రావ్, వ్యవసాయ అధికారి జాడి దివ్య, ఏఈలు రాథోడ్ సునీల్, జాడి లింగన్న, శ్రీనివాస్, ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్, ఏవో పవార్ నితిన్, ఏపీఎం మాధవి, ఎంఈవో రాపెల్లి ఆశన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. గాదిగూడలోని రైతువేదికలో 40 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆడ చంద్రకళారాజేశ్వర్, వైస్ఎంపీపీ యోగేశ్, డిప్యూటీ తహసీల్దార్ కనక యాదవ్రావ్, ఎంపీడీవో సాయిప్రసాద్, ఎంపీటీసీ కిరణ్, సర్పంచ్లు పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
తము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు గాదిగూడలోని రైతు వేదికలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. ఇక్కడ అంగన్వాడీ టీచర్లు పంచశీల, పంచపూల, కవిత ఉన్నారు.