ముథోల్, ఆగస్టు 3 : అంగన్వాడీ చిన్నారులకు పోషకాహారం అందించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బుధవారం ముథోల్లోని డీలక్స్ కల్యాణ మండపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా దివ్యాంగులు, కిశోర బాలికలకు పోషకాహార కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషకాహార కిట్లలో నెయ్యి, గోధుమలు, ఖర్జూరతో పాటు విటమిన్లను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ సెంటర్లకు భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, సీడీపీవో శ్రీమతి, ఎంపీడీవో సురేశ్బాబు, ఎంపీటీసీ భూమేశ్, సర్పంచ్ రాంరెడ్డి, రమేశ్, మురళి, పోశెట్టి పాల్గొన్నారు.
తల్లి పాలతో బిడ్డకు ఆరోగ్యం
భైంసా, ఆగస్టు 3 : తల్లిపాలు బిడ్డలకు ఆరోగ్యమని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించి పోషకాహార కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, బామ్ని రాజన్న, రాము, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, డా.ఫిర్దూస ఖలీం పాల్గొన్నారు.
వీఆర్ఏలకు మద్దతు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతున్న వీఆర్ఏల దీక్షకు ఎమ్మెల్యే విఠల్రెడ్డి మద్దతు తెలిపారు. వీఆర్ఏల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎంపీపీ కల్పన జాదవ్, గణేశ్, తోట రాము ఉన్నారు.
ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలి పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.