తానూర్, జూలై, 15 : అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలం బొంద్రట్ గ్రామంలో రూ.20 లక్షలతో చేపడుతున్న పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ, రూ.25 లక్షలతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డిని గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారని అన్నారు.
పల్లెప్రగతిలో గ్రామాల్లో సమస్యలు తొలగిపోయాయని అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమం చేపట్టిందన్నారు. పాఠశాలలకు నిధులు కేటాయించడంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయికి చేరాయన్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణం, పెండింగ్ పనులకు త్వరలో నిధులు మంజూరు చేసి పూర్తి చేయిస్తామని తెలిపారు. బొంద్రట్ నుంచి అమృత్సాబ్ గుట్ట వరకు రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో 20 మంది విద్యార్థులతో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైన పాఠశాల నేడు 105 మంది వరకు చేరడం గర్వంగా ఉందన్నారు.
పాఠశాల ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు. బెల్తరోడ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ.3.25లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. అనంతరం మండలంలోని బోరిగాం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయాలైన మండల అధ్యక్షురాలు మంజుల భర్త సురేశ్యాదవ్ను పరామర్శించారు.
కార్యక్రమంలో సర్పంచ్ మందాకినికేశవ్, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కానుగంగి పోగారెడ్డి, మాజీ జట్పీటీసీ ఉత్తమ్ బాలేరావ్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు తాడేవార్ విఠల్, మండల కోఆప్షన్ సభ్యుడు గోవింద్పటేల్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు, సర్పంచ్లు అబ్దుల్గని, బాలాజీ, పుండ్లిక్, సాయినాథ్, ఎంపీటీసీ లక్ష్మణ్, నాయకులు రాజారెడ్డి, సాయినాథ్, శ్రీనివాస్రెడ్డి, అఠల్ దేవీదాస్, బండారే పోశెట్టి, విఠల్, లస్మన్న, బాలాజీ, భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దేవీదాస్, దిగంబర్పటేల్, పంచాయతీ కార్యదర్శి జయశ్రీ, కార్యకర్తలు పాల్గొన్నారు
ఎమ్మెల్యేకు వినతి
భైంసాటౌన్, జూలై 15 : తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నియోజకవర్గంలోని బాసర, లోకేశ్వరం మండలాల గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు శనివారం దేగాంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం కేసీఆర్తో మాట్లాడి డిమాండ్లు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. పట్టణానికి చెందిన కే గంగాధర్కు సీఎం సహాయనిధి నుంచి రూ.18 వేలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మంత్రి భోజరాం, తదితరులు పాల్గొన్నారు.