మంచిర్యాలటౌన్, మార్చి 2 : విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కే వరుణ్రెడ్డి అన్నారు. శనివారం నస్పూరులోని ఫ్లడ్ కాలనీలో గృహజ్యోతి పథకం జీరో బిల్లుల మంజూరు రసీదులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం పాతమంచిర్యాలలో ఉన్న విద్యుత్ శాఖ జిల్లా స్టోర్స్ను వరుణ్రెడ్డి పరిశీలించారు. స్టోర్స్లో అన్ని రకాల సామగ్రి అందుబాటులో ఉంటుందా.. అని అడిగి తెలుసుకున్నారు. సామగ్రి నిలువలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఎస్ఈ శేషారావు, డీఈ ఖైసర్, ఏడీఈలు రేగుంట స్వామి, రాజశేఖర్, స్టోర్స్ ఏడీ విలాస్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, మార్చి 2 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నస్పూర్లో లబ్ధిదారులకు జీరో బిల్లులు అందజేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ ఆడిచర్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో గ్రామంలోని పలు నివాసాలకు సిబ్బంది పర్యటించి జీరో బిల్లులు అందించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో నస్పూర్ సబ్ స్టేషన్ కార్యాలయంలో సీఎండీ వరుణ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. దరఖాస్తు చేసుకోని వారు తహసీల్దార్ కార్యాలయంలో, మున్సిపల్ ఆఫీసుల్లో తమ దరఖాస్తులు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ శేషారావు, డీఈ కైసర్, సెక్షన్ అకౌంట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏడీఈ రాజశేఖర్, అకౌంట్ ఆఫీసర్ రమేశ్ పాల్గొన్నారు.