నిర్మల్ టౌన్, ఆగస్టు 11 : తెలంగాణ రాష్ట్రం బీసీ కులవృత్తుల వారు ఆర్థికంగా బలపేతమవ్వా లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష సాయం పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో బీసీ కుల వృత్తుల వారికి రెండో విడుత కింద మంజూరైన లబ్ధ్దిదారులు 250 మందికి 2.5కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ జిల్లా లో ఇప్పటి వరకు 500 మందికి చెక్కులను అందించామని తెలిపారు. ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో మరో 250 మందికి చొప్పున చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలు అందజేయనున్న ట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు దాన్ని రాజకీ యం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కలెక్టర్ వరుణ్రెడ్డి మాట్లాడుతూ బీసీ కుల వృత్తుల వారికి రూ. లక్ష సాయం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
రైతుబంధు పథకం ఏ పార్టీ నేతలను చూడకుం డా తమ ప్రభుత్వం ఎకరానికి రూ. 5వేల చొప్పున ఖాతాలో జమ చేస్తున్నదని తెలిపారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటువంటి పథకాలు ఎక్కడైనా అమలు చేస్తుందా సూటిగా ప్రశ్నించారు. జడ్పీ చైర్పర్సన్ విజయ లక్ష్మి, నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు సుభాష్రావు, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ చందు, నిర్మల్ రైతు బంధు సమితి కన్వీనర్ ధర్మాజీ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి, పద్మ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 11 : ప్రజల సౌకర్యా ర్థం జిల్లా కేంద్రంలో రూ.7 కోట్ల నిధులతో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పాత తహసీల్ కార్యాలయం, ఆర్అండ్ బీ ప్రాంగణం లో 3 ఎకరాల 10 గుంటల స్థలం ఉందని, రెండు ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సమీకృత, వెజ్, అండ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు.
వినియోగదారులు ఒక సారి మార్కెట్కు వెళ్లే అన్ని సరుకులు ఒకే చోట కొనుగోలు చేసేలా కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతు న్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే నిర్మల్ జిల్లా కేంద్రానికి రానున్నారని కోట్లాది రూపాయ లతో చేపట్టే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్ సలీం, నరహరి, అడ్ప విజయలక్ష్మీ పోశెట్టి, నరహరి, ఎస్పీ రాజు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా నిర్మల్ మున్సిపల్ పరిధిలోని బంగల్పేటట్, నాగనాయిపేట్లో గృహ ప్రవేశాలకు సిద్దంగా ఉన్న డబుల్బెడ్రూం ఇండ్లను మంత్రి పరిశీలించా రు. ఇండ్లలో ఉంటున్న లబ్ధిదారులతో ముచ్చటిం చారు. ఆగస్టు నెలలోనే సామూహిక గృహ ప్రవే శాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో నాగనాయిపేట్లో రూ.54.24 కోట్ల వ్యయంతో 1014 డబుల్ బెడ్రూం ఇండ్లు, బంగల్పేట్లో రూ.23.86 కోట్లతో 446 ఇండ్లను లబ్ధిదారులకు అందిం చామని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం రేషన్ డీలర్ల కమిషన్ పెంచినం దుకు నిర్మల్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం సభ్యులు శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాద పూర్వ కంగా కలిసారు. కమీషన్ పెంచినందుకు ప్రభు త్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రికి పూల మొక్కను అందించి శాలువాతో సన్మా నించారు. రేషన్ డీలర్ల అధ్యక్షుడు పలికె రాజేందర్ ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కొండ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.