ఎదులాపురం, మార్చి 15 : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలే బోరిగాం గ్రామ ఆదివాసులు రేవంత్ సరార్ రైతు భరోసా నిధులు వేయకపోవడంపై ఆదివారం నిరసన తెలిపారు. ‘చేనులో ఒక చేతిలో పాస్బుక్-మరో చేతిలో సెల్ఫోన్’తో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్రెడ్డి అనేక హామీలు ఇచ్చి అమలు చేయడంలో విపలం అయ్యారని మండిపడ్డారు.
పట్టా రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి అందరిని మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ మెస్రం పరమేశ్వర్, గెడం రాము, మోతిరామ్, కుమ్ర రాజు పటేల్, మాజీ సర్పంచ్ కుమ్ర గంగాదేవి, మహాజాన్ సేడ్మకి ఆనంద్రావు పాల్గొన్నారు.