భైంసా, నవంబర్ 25 : పట్టణంలో ఎలాంటి ర్యాలీ లకు అనుమతి లేదని ఏఎస్పీ కిరణ్ ఖారే అన్నారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు అను మతి లేదన్నారు. ఎవరైనా ర్యాలీలు తీసినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పోలీసు లకు ప్రజలు సహకరించాలని కోరారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ఏఎస్పీ కిరణ్ ఖారే పేర్కొన్నారు. మండలంలోని మాంజ్రి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించి అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దొంగ తనాలు, అవాంఛనీయన సంఘటనలు చోటు చేసుకుం టే సీసీ కెమెరాలతో నిందితులను గుర్తించవ చ్చని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు పోలీసు శాఖ వారు తీసుకుంటున్న చర్యలకు సహకరించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చూడాలని కోరారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, సీఐ చంద్రశే ఖర్, ఎస్ఐ శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు హన్మండ్లు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.