నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 5 : నిర్మల్ను గంజా యి రహిత జిల్లాగా మార్చేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క పెరగకుండా చూడాలని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గంజాయి సాగు, విక్రయం, సరఫరా చేసే వారిపై పోలీస్, ఎక్సైజ్ అధికారులు నిఘాను మరింత ముమ్మరం చేశారు. గతంలో జిల్లాలో గంజాయి సాగు చేసిన వారి వివరాలు ఆరా తీసి, వారిని సన్మార్గంలో నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామీ ణ, తండాలు, పట్టణ ప్రాంతాలలో అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంజాయి సాగుతో ప్రజలకు కలిగే ఇబ్బందులు, యువతపై ప్రభావం, రైతులకు కలిగే నష్టాలు, సంక్షేమ పథకాలపై ప్ర భావం చూపే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలోని మూరుమూల గిరిజన గ్రామాలు, తండాలు, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పలువురు అక్రమార్కులు కొన్నేళ్లుగా గంజాయి సాగు చేస్తున్నారు. వీటన్నింటికీ అడ్డు కట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎక్సైజ్, రెవెన్యూ శాఖ అధికారులు సన్నద్ధ్దమయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మత్తు పదార్థాల విక్రయాలకు అడుకట్ట వేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పోలీస్, ఎక్సెజ్ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా రంగంలోకి దిగగా రెవెన్యూ శాఖ అధికారుల సహాయం సైతం వినియోగించుకోనున్నారు. మూడు శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించి జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేయనున్నారు.
జిల్లాలో ఖానాపూర్ నియోజక వర్గంలోని అటవీ ప్రాంతంలో ఐదేళ్ల అప్పటి సీఐ నరేశ్ కుమా ర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో పెద్దమొత్తంలో సాగు చేసిన గంజాయి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. సారంగాపూర్ మండలం రాజరాజేశ్వర తండాలో మూడేళ్ల క్రితం పదెకరాల్లో గంజాయి సాగు చేస్తుండగా అప్పటి ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇటీవల సారంగాపూర్ మండలం రాంసింగ్ తండా, బండరేవు తండాలోని పంట పొలాల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కుభీర్ మండలం గంజా యి సాగు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో భైంసాకు చెందిన ఓ వ్యక్తి, నిర్మల్కు చెందిన వ్యక్తుల నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఇవి బయట పడిన ఘటన కాగా.. బయటకు రాని ఘటనలు ఇంకా అనేకం ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా నిలిపి వేయనుండగా… ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
జిల్లాలో గంజాయి వినియోగించే వారు, విక్రయించే వారి చిట్టాను రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లాలో సాగు చేసే వారి వివరాలు ఆరా తీస్తున్నారు. గతంలో సాగు చేసిన వారి వివరాలు సేకరించి ప్రస్తుతం వారు అదే వృత్తిని కొనసాగిస్తున్నారా.. పద్ధతి మార్చుకున్నారా అనే వివరాలు సేకరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి దిగుమతిపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో సాగు చేసిన వారిని బైండోవర్ చే స్తూ పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు. విక్రే తలు, సాగు చేసే వారు, దిగుమతి, ఎగుమతి చేసే వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత వీటి నుంచి బయట పడేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. మత్తు పదార్థాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులతో పాటు ప్రజలు సహకరించాలని, వాటితో కలిగే అనర్థాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శనలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ఉక్కుపాదం మోపుతున్నాం. ఇప్పటికే గతంలో కేసులు నమోదైన వారిపై నిఘా పటిష్టం చేశాం. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మత్తుపదార్థాలపై ఎక్కువగా బానిసైన యువతపై ప్రత్యేక నిఘా ఉంచాం. వీటి నుంచి వారిని విముక్తి చేసేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన చర్యలు చేపడుతాం. గంజాయి విక్రయించినా, సాగు చేసినా, దిగుమతి చేసినా కఠిన చర్యలు తీసుకొని పోలీసుల సహకారంతో పీడీ యాక్టు కేసు లు నమోదు చేసేలా చర్యలు చేపడుతాం. జిల్లా లో గంజాయిని సాగు చేసే వారికి ప్రభుత్వం అందించే రైతు బంధు, రైతు బీమా వర్తించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
-రవీందర్ రాజు, జిల్లా ఇన్చార్జి ఎక్సైజ్ సూపరింటెండెంట్, నిర్మల్