నిర్మల్ అర్బన్ : పరిసరాల పరిశుభ్రత, కరోనా వైరస్ కట్టడిలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సీడీఎంఏ అందజేసిన దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులను మంత్రి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాలను నిరంతరంగా పరిశుభ్రంగా ఉంచడంలో వీరి పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.
వీరు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల వేతనాలను పెద్ద మొత్తంలో పెంచిందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, పూదరి రాజేశ్వర్, నాయకులు అడ్ప పోశెట్టి, శ్రీధర్, నామెడ గజేంధర్, మాజీ కౌన్సిలర్ ఆకోజి కిషన్, బంగల్పేట్ ఆలయ చైర్మన్ గంగాధర్, అప్పాల వంశీ, రవి, రఘు, పూదరి శివ తదితరులున్నారు.