ఖానాపూర్ టౌన్ : మామడ మండలం పోన్కల్ గ్రామ శివారులోని గోదావరిపై నిర్మిస్తున్నసదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బుధవారం పరిశీలించారు. ఖానాపూర్, కడెం మండలాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరనుందని ఆమె అన్నారు. పోన్కల్ శివారులో అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న బ్యారేజీ పనులను, గేట్లను ఆమె పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ఖానాపూర్ నియోజకవర్గ రైతులకు రెండు పంటలకు సరిపడా సాగు నీరందించాలని అధికారులకు సూచించారు.
వచ్చే ఏడాది జూన్లోగా పనులు పూర్తి చేయనున్నట్లు సదరు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే రేఖానాయక్ వివరించారు. ఆమె వెంట ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, నీటి పారుదలశాఖ అధికారులు ఉన్నారు.