నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 8: తక్కువ రేటుకు విదేశీ కరెన్సీ ఇస్తామంటూ మోసగించేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ ప్రాంతానికి చెందిన అలీఖాన్, ఆస్మాబేగం ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పలువురిని మోసగిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీలో రూ. 2 వేల విలువైన 15 విదేశీన కరెన్సీని పేపర్లో చుట్టి విక్రయించేందుకు యత్నించారు. ఆ కరెన్సీని కొనుగోలు చేస్తున్న వ్యక్తికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అలీఖాన్, ఆస్మాబేగంను అరెస్టు చేశారు. వీరు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో మోసాలకు పాల్పడినట్లు సీఐ తెలిపారు.నిందితులనుంచి 15 విదేశీ కరెన్సీ, మూడు సెల్ఫోన్లు, వివిధ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను అభినందించారు.