నిర్మల్ అర్బన్, డిసెంబర్ 25 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి-విజయలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి వేదపండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రజతోత్సవాల మొదటి రోజులో భాగంగా గోపూజ, గురుప్రార్థన సంకల్పం, గణపతి పూజ, పుణ్యావచనం, రక్షాబంధనం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, నవగ్రహ మాతృక యోగిని, మండల దేవతాస్థాపన వంటి పూజా కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి- వినోదమ్మ దంపతులు చేపట్టారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, అల్లోల తిరుపతి రెడ్డి, ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, గురుస్వాములు పాకాల రాంచందర్, యువరాజు, ఆనంద్, అంజయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో నిర్మల్ పేరు నిలబెట్టాలి
యోగాలో నిర్మల్ పేరును నిలబెట్టేలా నిర్వాహకులు మరింత కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో నిర్మల్కు చెందిన అవినాష్, రవీందర్, దిలీప్ తదితరులు యోగా పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. దీంతో వారిని ఆదివారం మంత్రి సన్మానించారు. నిర్మల్ జిల్లాలో యోగా నిర్వాహకులు ఎంతో మంది ఉన్నారని, ప్రతి ఒక్కరూ నైపుణ్య శిక్షణనిచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చూడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యోగా నిర్వాహకురాలు అన్నపూర్ణ, పురుషోత్తం, ధర్మరావు, వనిత, కరీం తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి వినతి..
నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మార్గ్లో ఉదాసీన మఠం భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ఆదివారం మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కలిసి విన్నవించారు. ఉదాసీన మఠానికి సంబంధించిన ఖాళీ భూమిని కొందరు ఆక్రమించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని, వెంటనే దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీనాయకులు గంగాధర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.