ఖానాపూర్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 61 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గొరె గంగాధర్, ఎంపీపీ అబ్దుల్ మొయీద్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, ఇన్చార్జి తాసీల్దార్ ఫారూఖ్, ఆర్ఐ రాజేశ్వర్, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు సురేశ్, రాజగంగన్న, నాయకులు ప్రదీప్, గజేందర్, శంకర్, కిశోర్, మహేశ్, శేఖర్రెడ్డి, నర్సయ్య, లింగన్న, మల్లేశ్, విజయ్, రత్నం, పలు గ్రామల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.