నిర్మల్ అర్బన్ అక్టోబర్ 23 : దీపావళి పండుగ వేళ నిర్మల్ జిల్లాలో నాసిరకం వస్తువుల విక్ర యం విచ్చల విడిగా కొనసాగుతున్నది. అధికారు లు తరుచూ తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపా రులు హద్దు మీరుతున్నారు. దీంతో అమాయక ప్రజలు నాసిరకం వస్తువులు, సామగ్రి కొనుగోలు చేస్తూ అనారోగ్య సమస్యల బారిన పడుతు న్నారు. జిల్లాలో మూడు రోజుల నుంచి హోటళ్లు, స్వీట్ దుకాణాలు, కిరా ణ దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి కల్తీ పదార్థాల ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరీక్షల కోసం ల్యాబ్కు తరలించారు.
ప్రముఖ బ్రాండ్ల పేరిట..
సాధారణ బ్రాండ్ల నుంచి ప్రముఖ కంపెనీల వరకు నాసిరకం వస్తువులు విక్రయిస్తున్నారు. చిన్న కిరాణ కొట్టు నుంచి పెద్దపెద్ద దుకాణాల్లో సైతం ఇటీవలే జిల్లా కేంద్రంలోని నారాయణ రెడ్డి మార్కెట్లో ఓ దుకాణంలో టాస్క్ఫోర్ అధికా రులు తనిఖీ చేశారు. ప్రముఖ కంపెనీ పేరుతో విక్రయిస్తున్న నకిలీ జండుబామ్, అగర్బత్తీలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇది కూడా ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
విచ్చల విడిగా విక్రయం..
కిరాణ కొట్టులో విక్రయించే సాధారణ పదా ర్థాలతో పాటు భారీ హోటల్లో విక్రయించే పదార్థాలు కల్తీతో కూడుకున్నవి ఉంటున్నాయి. హోటల్లో ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. కిచెన్ వంట గదులు, కోల్డ్ స్టోరేజీల్లో శుభ్రత పాటించడం లేదని తనిఖీల్లో వెల్లడవుతున్నది. అపరిశుభ్రత, కుళ్లిన పదార్థాలతో వంట చేయడం తో గతంలో ఓ హోటల్ను సీజ్ చేశారు. దాడులు చేసే సమయంలోనే నిబంధనలు పాటిస్తూ ఆ తర్వాత హోటళ్ల నిర్వాహకులు నిబంధనలు పట్టించుకోవడం లేదు. మూడు రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, కిరాణ, స్వీట్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కొన్ని కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకొని శాంపిళ్లను ల్యాబ్కు తరలించారు.
రూ.19 లక్షల నూనె సీజ్
శనివారం నిర్మల్లో అనుమానాస్పదంగా ఉన్న రెండు లారీలను పోలీసులు గుర్తించారు. ప్రముఖ కంపెనీల పేరుతో కల్తీగా ఉన్న రూ.19 లక్షల విలువైన నూనెను సీజ్ చేశారు. శాంపిళ్లను సేకరించి హైదరాబాద్లోని నాచారం ల్యాబ్కు తరలించారు.అప్పటి వరకు వాహనాలను సీజ్ చేసి వాటి విక్రయాలను నిలిపి వేశారు.
నిరంతరం దాడులు నిర్వహిస్తాం..
ప్రజల ఆరో గ్యా న్ని దృష్టిలో ఉంచు కొని జిల్లాలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తాం. చిన్న దుకాణం నుంచి సూపర్ మార్కెట్ వరకు ప్రజలకు నాణ్యమైన వస్తు వులనే విక్రయిం చాలి. స్వీట్ దుకాణాలు, హోటళ్లల్లో ప్రజలకు ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలకు వాడవద్దు. ప్రతీ వ్యాపారి నిబంధనలు పాటించా లి. పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసు కుంటాం. గడువు ముగిసిన వారు లైసెన్స్లను రెన్యూవల్ చేసుకోవాలి.
– ప్రత్యూష(జిల్లా ఇన్చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి)