దస్తురాబాద్, జూన్ 19 : పట్టణ వాసులే కాదు పల్లెవాసులు ఆధునిక పరిజ్ఞానం వైపు ముం దు కెళ్తున్నారు. పట్టణాల్లోనే ఉన్న హౌస్ లిఫ్టింగ్ ఇప్పుడు పల్లెల్లోకి విస్తరించింది. మున్యాల గ్రామానికి చెందిన బద్ది భీమేశ్ ఇల్లు రోడ్డు కిందికి ఉండడంతో జాకీల సాయంతో ఇల్లును పైకి లేపా రు. నాలుగేళ్ల క్రితం సింగిల్ రోడ్డు ఉండే. కడెం మండలం పాండ్వాపూర్ నుంచి మండల కేంద్రం గుండా మంచిర్యాల జిల్లా కలమడుగు వరకు డబుల్ రోడ్డు వేశారు. ఈ క్రమంలో రోడ్డు ఎత్తును పెంచారు. కాగా బద్ది భీమేశ్ ఇల్లు కిందికి అయిం ది. వర్షపు నీరు ఇంట్లో కి వచ్చి చేరేవి. తన ఇంటిని ఎత్తు పెంచాలని ఆలోచించాడు. యూ ట్యూబ్లో హౌస్ లిఫ్టింగ్-షిఫ్టింగ్ వీడియోను చూశాడు. అందులో ఉన్న ఫోన్ నంబర్ను సంప్రదించాడు. జై హనుమాన్ కంపెనీ నెల్లూర్ వారు ఇంటి పొడ వు వెడల్పు తీసుకున్నారు. కొలతల ఆధారంగా రూ. 2 లక్షల 20 వేలకు ఒప్పందం మాట్లాడుకు న్నారు. 150 జాకీలతో బీహార్ కార్మికులు మున్యా లకు వచ్చారు. 15 రోజుల్లో 6 ఫీట్ల ఎత్తు పెంచి పూర్తి చేస్తామని చెప్పారు. 80 నుంచి దాదాపు 100 పైగా జాకీలను పెట్టి ఆరు ఫీట్ల మేర ఇల్లు ఎత్తును పెంచారు. పనులు పూర్తయ్యాయి. మారు మూల గ్రామంలో ఇల్లు ఎత్తును పెంచడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
చాలా ఇబ్బందులు పడ్డాం..
2021లో మా నాన్న ఇల్లు కట్టాడు. వర్షం పడి నప్పుడు ఆ నీరు మొత్తం నిం డిపోయేది. చాలా ఇబ్బందులు పడ్డాం. యూ ట్యూబ్ హౌస్ లిఫ్టింగ్-షిఫ్ట్టింగ్ వీడియో చూశాను. ఫోన్ నంబర్ తీసుకున్నాను. నెల్లూర్ జిల్లాకు చెందిన జై హనుమాన్ కంపెనీ వారు కాంటా క్ట్లోకి వచ్చారు. ఇంటి వివరాలు పంపాను. రూ 2 లక్షల 20 వేలకు ఒప్పందం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం జాకీలతో ఇంటిని ఆరు ఫీట్ల మేరకు ఎత్తును పెంచారు. ఈ ఆధునిక పద్ధ్దతి ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతున్నది.
– బద్ది భీమేశ్, ఇంటి యాజమాని(మున్యాల)