భైంసా, జూన్ 19 : మనిషి మనుగడకు మూలమైన మట్టి, నీరు, గాలిలో ప్లాస్టిక్ కణాలు వ్యాపించాయన్న వాస్తవం పలు అధ్యయనాల్లో వెల్లడైంది. గాలిలోని దుమ్ము, కణాల వల్ల మనిషి ఆయుష్ ఐదేళ్లు తగ్గిపోతుందని పర్యావరణ నిపు ణులు హెచ్చరిస్తున్నారు. మట్టి, గాలి, నీరు కలుషి తం కాకుండా కట్టడి చేయడానికి జూన్ 30 న ఒకేసారి వాడి పారేసి ప్లాస్టిక్ రహిత భారత్ ఆవి ర్భవించిందని ప్రకటించి జూలై 1 నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందు కోసం భైంసాలోని మున్సిపల్ ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5 నుంచి పెద్ద ఎత్తున పరిసరాలను శుభ్రం చేయడం, క్రమం తప్పకుండా ఇంటింటికీ వాహనాలను పంపి చెత్తా చెదారం సేకరించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు
50 మైక్రాన్ల కంటే తక్కువ మందంతో తయారైన ప్లాస్టిక్ వస్తువులను సింగిల్యూజ్ ప్లాస్టిక్గా పేర్కొంటున్నారు. ప్లాస్టిక్ బ్యాగులు, ప్లేట్లు, కప్పులు, నీళ్ల సీసాలు, సోడా బాటిల్, పుడ్ ప్యాకేజీ కంటెనర్, స్ట్రాలు, ట్రేలు, తదితర ప్లాస్టిక్ వస్తువులు ఈ జాబితాలోకి వస్తాయి.
ప్లాస్టిక్ నిషేధం దిశగా చర్యలు
నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తే భారీగా జరిమా నా విధిస్తాం. పర్యావరణ పరిరక్షణ కోసం పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నాం. స్వచ్ఛతను సాధించేందుకు కృషి చేస్తున్నాం.
అలీం, భైంసా మున్సిపల్ కమిషనర్,