దిలావర్పూర్, జూన్ 14 : సర్కారు స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీపీ అక్షర అన్నారు. దిలావర్పూర్, న్యూలోలం, సిర్గాపూర్లో మంగళవారం బడిబాట ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్ ఆర్డీవో తుకారాం, సర్పంచ్లు వీరేశ్కుమార్, ఓడ్నం సవిత, గంగారెడ్డి, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్, ఎంఈవో శంకర్, ఐకేపీ ఏపీఎం సులోచనా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్ధే అనిల్, గుణవంత్రావు, కార్యదర్శి చంద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 14 : సర్కారు స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమై విద్య అందిస్తున్నట్లు అప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్, మంజులాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సిద్ధ పద్మ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, మంజులాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. కార్యక్రమంలో శాంతినగర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, లక్ష్మణ్ ఉన్నారు.
రూ.21లక్షలతో పనులు ప్రారంభం
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పార్డి(బీ) ప్రాథమిక పాఠశాలలో రూ.21లక్షలతో అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, హెచ్ఎం సంధ్య, ఎస్ఎంసీ చైర్మన్ అంజద్ శంకుస్థాపన చేశారు. మొదటి విడుతలోమండలంలోని 24 పాఠశాలలకు రూ.9కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యదర్శి కమల్సింగ్, ఉప సర్పంచ్ తుకారాం, యెఖీనొద్దీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
లోకేశ్వరం, జూన్, 14 : మండలంలోని రాజురా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేశ్ రావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం రమేశ్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని హరిజనవాడ పాఠశాలలో బడిబాట, మన ఊరు- మనబడి కార్యక్రమాలు నిర్వహించారు. రూ . 8.45 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ తాడేవార్ విఠల్, ఉప సర్పంచ్ నయీం, పాఠశాల చైర్మన్ పవార్ జ్యోతి, హెచ్ఎం సుజాత, కార్యదర్శి జాదవ్ జాలంసింగ్, సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆరో వార్డు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడీ కేంద్రంలో వివిధ పోటీల్లో గెలిచిన వారికి మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అఫ్రినా బేగం, అమానుల్లాఖాన్, వాహబ్, షర్జిల్, అజ్మత్, రాజు, జావేద్, అంగన్ వాడీ టీచర్లు వరలక్ష్మి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.