లక్ష్మణచాంద, జూన్ 14 : పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర, ధర్మారంలో మంగళవారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్తో కలిసి గ్రామంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేశ్, పీచర సర్పంచ్ బుర్రి లత, ధర్మారం సర్పంచ్ కుర్మ రాజేందర్ రెడ్డి, ఎంపీడీవో శేఖర్, ఎంపీవో నసీరొద్దీన్ పాల్గొన్నారు.
కడెం, జూన్ 14: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్లో నర్సరీ, క్రీడాప్రాంగణాన్ని ఎంపీడీవో లింబాద్రి పరిశీలిం చారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. అక్కడి నుంచి ప్రాథమిక పాఠశాలకు చేరు కొని విద్యార్థులతో ముచ్చటించారు. పల్లెప్రగతి కార్య క్రమానికి ముందు గ్రామసభ తీర్మానం ప్రకారం ఎంచు కున్న పనులు చేపట్టిన సర్పంచ్ బొడ్డు గంగన్నను అభినం దించారు. కార్యక్రమంలో కార్యదర్శి రమాదేవి, ఉపాధ్యా యుడు ప్రతాప్, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, ఆశ కార్యకర్త గోదావరి, కారోబార్ మహేందర్, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
దస్తురాబాద్,జూన్ 14 : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులను గ్రామ ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
తానూర్, జూన్ 14 : మండలంలోని జవలా(బీ), తొండలా గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో, తహసీల్దార్ వెంకటరమణ పరిశీలించారు. మండలంలోని క్రీడా మైదానాలను త్వరగా అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. వీరి వెంట సర్పంచ్లు సాతప్ప పటేల్, ఎంపీవో మోహన్సింగ్, ఏపీవో గంగాధర్, మతీన్, ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 14 : సింగాపూర్, రాజురాలో సర్పంచ్ చిన్నం లావణ్య, రవి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై సాయన్న అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షాకీర్, మహేశ్, అంగన్ వాడీ టీచర్లు హేమలత, అమృత, లింగన్న, పులివేని సత్యనారాయణ, ప్రత్యేక అధికారి మదన్ మోహన్ గౌడ్, కార్యదర్శిలు అనిల్, మధు గ్రామస్తులు పాల్గొన్నారు.
పెంబి, మే 14: మండలంలోని తాటిగూడ, లంబాడితండా, లోతోర్యతండాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తహసీల్దార్ అడ్ప శ్రీధర్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తానాజీ, ఎంపీవో చిక్యాల రత్నాకర్ రావు, ఆర్ఐ షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.