నిర్మల్ ఆర్భన్, మే 24: నీటి పారుదల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై మంత్రి హైదరాబాద్ లోని అరణ్యభవన్లో మంగళవారం అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 27,28 సదర్మాట్ బ్యారేజీ, చెక్డ్యాం నిర్మాణా లు, చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పను లపై సమగ్రంగా చర్చించారు. గతేడాది కురిసిన భారీ వర్షాల వల్ల నిర్మల్ జిల్లాలో 110 చెరువులు, కుంటలు, కాల్వలకు గండ్లు పడ్డాయని వాటి పునరుద్ధ్దరణ పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రి ఆరా తీశారు. 28 చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని అధికారు లు వివరించారు. మొదటి విడుతలో నిర్మల్ జిల్లాలో చేపట్టిన చెక్డ్యాంల నిర్మాణ పనుల్లో 18 చెక్ డ్యాంల పనులు కొనసాగుతున్నా యని అధికారులు వివరించారు. రెండో దశలో సుమారు 43 చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపా దనలు పంపామని చెప్పారు.
ప్రస్తుతం రూ.150 కోట్లతో నిర్మల్, మంచిర్యాల జిల్లాలో 25 చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధ్దం చేసి టెండర్లు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ 27 ద్వారా జులైలోగా చెరువులకు నీళ్లు అందించేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు. ప్యాకేజీ 28లో కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంతో కొత్తగా టెండర్లు పిల వాలని ఆదేశించారు. గుండె గాం ముంపు సమస్యను త్వరగా పరిష్కరించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి సీఈ ఎన్ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుశీల్కుమార్, ఈఈ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
‘నమస్తే’ ఎండీని కలిసిన మంత్రి అల్లోల
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దీవకొండ దామోదర్రావును హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆయన నివాసంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కలిశారు. అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.