నిర్మల్ టౌన్, మార్చి 12 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు 18 ఉన్నాయి. ఒక్కొక్క మార్కెట్ కమిటీలో 14 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇందులో ఎనిమిది మంది స్థానిక నాయకులు, ఇద్దరు ట్రేడర్లు, ఒక చైర్మన్, ఒక మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్గా గ్రామం అయితే సర్పంచ్, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ చైర్మన్లను ప్రభుత్వం నియమిస్తుంది. వీరిని నామినేటెడ్ పద్ధతిలో చేపడుతుంది. ఎన్నికైన పాలకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. ప్రస్తుతం పాలకవర్గం రెండేండ్లపాటు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈ గడువును మరో ఏడాది పొడిగించారు. అదేవిధంగా ఒక్కొక్క పాలకవర్గంలో ప్రస్తుతం 14 మంది సభ్యులుండగా.. మరో నలుగురిని పెంచడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో 72 మందికి అదనంగా పదవులు దక్కనున్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్, సారంగాపూర్, కుభీర్, భైంసా, ఖానాపూర్.. మంచిర్యాలలో జన్నారం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట్.. ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్, కాగజ్నగర్, జైనూర్.. ఆదిలాబాద్లో ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, జైనూరు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెట్ పన్నులు వసూలు చేస్తారు. కొత్త పాలకవర్గాలు ఏర్పడితే మరో నలుగురికి అదనపు రాజకీయ పదవులు దక్కనుండడంతో పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం..
రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారు. రైతులకు వెన్నుదన్నుగా ఉండే మా ర్కెట్లను బలోపేతం చేసేం దుకు మార్కెట్ పాలకవ ర్గాల గడువును రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు పెం చడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల పదవి లో ఉన్న వారు రైతులకు సేవ చేసేందుకు ఇది ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఉన్న పాలకవ ర్గంలో 14 మందికి సభ్యులుండగా.. ఆ సంఖ్యను నలుగురికి పెంచడం వల్ల మార్కెట్ కమిటీలో మరికొందరికీ రాజకీయ పదవులు దక్కను న్నాయి. – నర్మద, మార్కెట్ కమిటీ చైర్పర్సన్
స్వరాష్ట్రంలోనే మార్కెట్ల అభివృద్ధి..
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల కింద వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేపట్టింది. మార్కెట్ కమిటీలకు పంట ఉత్పత్తులకు రవాణా ద్వా రా వచ్చే పన్నుల చెక్పోస్టులను ఎత్తివేయడంతో రావాల్సిన ఆదాయం పూర్తిగా గండి పడింది. దీని వల్ల నిర్వహణ భారమైంది. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్కు మళ్లీ పునర్జీవం కల్పించాలన్న ఉద్దేశంతో మార్కెట్ పాలకవర్గాన్ని మూ డేళ్లకు పెంపు, సభ్యులసంఖ్య 14-18కి పెంచ డం వల్ల మార్కెట్లకు మంచి రోజులు రానున్నాయి.
– శ్రీనివాస్, వ్యవసాయ మార్కెటింగ్ ఏడీ, ఆదిలాబాద్.