ఖానాపూర్ టౌన్ : ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో నాన్ ట్రైబల్ రైతులకు ఆన్లైన్లో పహాణి రాకపోవడంపై శుక్రవారం ఎమ్మెల్యే రేఖానాయక్ అసెంబ్లీ సమావేశంలో సభ దృష్టికి తీసుకువచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో రెవెన్యూ అధికారులు మ్యానువల్ పహాణిలు అందించేవారని అన్నారు. కాని ప్రస్తుతం అన్లైన్ ద్వారా పహాణిలు అందివ్వక పోవడంతో అక్కడి రైతులు పంట రుణాలను రెన్యువల్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన నాన్ ట్రైబల్ రైతులకు మ్యానువల్ పహాణిలు అందించి రుణాలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.