భైంసాటౌన్ : మండలంలోని దేగాం గ్రామంలో శుక్రవారం నుంచి కొనసాగుతున్న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పండితులు వేద మంత్రోశ్ఛరణలతో నూతన ఆలయంలో పెద్దతల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ హయాంలోనే దేవాలయాలకు మహర్దశ వచ్చిందని, దేగాంలో పెద్దమ్మ తల్లి ఆలయానికి దేవాదాయ శాఖ ద్వారా రూ. 30 లక్షలు మంజూరు అయ్యాయని అన్నారు. గ్రామానికి చెందిన పలు జంటలు వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రోశ్ఛరణల మధ్య హోమం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. చుట్టు పక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎంపీపీ కల్పనజాదవ్తో కలిసి దేగాం గ్రామంలో నిర్వహించిన రైతు వేదికను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పిప్పెర కృష్ణ, వైస్ ఎంపీపీ గంగాధర్, దేగాం సర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, ఎంపీటీసీ మాణిక్, సిరాల సర్పంచ్ సతీశ్, ఇలేగాం సర్పంచ్ ముత్యం, మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి, ఎంపీడీవో గంగాధర్, ఏవో రాంచందర్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు గణేశ్ పాటిల్, తోట రాము, పోతన్న, సోలంకి భీంరావు, రమణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.