కడెం : ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపూర్కాలనీ, నచ్చన్ఎల్లాపూర్, ఎలగడప, లింగాపూర్, పెద్దూర్తండా, కొండుకూర్, పెద్దబెల్లాల్, అంబారిపేట, లక్ష్మీపూర్, కల్లెడ, ఉడుంపూర్ గ్రామాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆడబిడ్డలకు వివాహాలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం తరుఫున వారిని ఆదుకోవడానికి రూ. లక్ష చొప్పుల సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని పేర్కొన్నారు.
రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పటికీ ప్రభుత్వం ఏ పథకాన్ని కూడా ఆపకుండా కొనసాగించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలను ఆదుకునేందుకు నూతన పింఛన్లు కూడా త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు బొడ్డు గంగన్న, రాముగౌడ్, ఆగునూరి సత్తమ్మ, ఒర్సు వెంకటేశ్, గోళ్ల వేణుగోపాల్, లక్ష్మి, విజయ, లావణ్య, కుర లక్ష్మి, మేకల రాజరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్హైమద్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు జొన్నల చంద్రశేఖర్, కుందనపెల్లి మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.