ఉట్నూర్ : దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 39 మందికి 50వేల రూపాయల చొప్పున రూ. 41 లక్షల చెక్కులను, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చేందుకు అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అపుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు అనేక పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, ఎంపీడీవో తిరుమల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.