నిర్మల్ టౌన్/అర్బన్, ఫిబ్రవరి 9 : గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులతోనే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని అదే స్ఫూర్తితో ఎంపీడీవోలు పని చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. నిర్మల్ ఎంపీడీవోల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2022 క్యాలెండర్, డైరీని బుధవారం మంత్రి, జడ్పీచైర్మన్, కలెక్టర్లు వేర్వేరుగా వారి కార్యాలయాల్లో ఆవిష్కరించారు. గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ఎంపీడీవోలపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, జడ్పీసీఈవో సుధీర్కుమార్, ఎంపీడీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్, గంగాధర్, ఎంపీడీవోలు సాయిరాం, నరేందర్, ఉషారాణి, వనజ, సుధారాణి, రమేశ్, శ్రీనివాస్రావు, శేఖర్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.