Vittaleshwara Swamy Temple | కుభీర్, ఫిబ్రవరి 25: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (కే) గ్రామంలోని శ్రీ విఠలేశ్వర ఆలయానికి అదే గ్రామానికి చెందిన దొంతుల రాజేందర్ సుమారు రూ.6వేల విలువ చేసే 50 ప్లేట్లను ఆలయ కమిటీకి అందజేశారు.
విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శుక్ల పక్షం, కృష్ణ పక్షంలోని ఏకాదశిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించి, మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ అన్నదాన కార్యక్రమం కోసం పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్తో కూడిన ప్లేట్లను వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. పైగా ఆ పేపర్ ప్లేట్లను తినడం వల్ల పశువులు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదది గమనించిన దొంతుల రాజేందర్, పర్యావరణ పరిరక్షణ కోసం 50 ప్లేట్లను ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ను గ్రామస్తులు, ఆలయ కమిటీ అభినందించారు.