భైంసాటౌన్ : అనారోగ్యంతో దవాఖానలో చికిత్సకోసం ఎదురుచేసే బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన టి. భోజవ్వకు రూ. 60 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును దేగాంలోని తన స్వగృహంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు సకాలంలో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దవాఖాన బిల్లులు సకాలంలో సమర్పిస్తే జాప్యం జరగకుండా సహాయనిధి మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కుప్టి గ్రామ సర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ నాయకుడు సచిన్ పటేల్, జాగృతి జిల్లా అధ్యక్షుడు దేవిదాస్, తదితరులు ఉన్నారు. తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉంబిరి నడిపి ఎల్లన్నకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి రూ. 24 వేల విలువ గల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ చాకెటి లస్మన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల సంతోష్, టీఆర్ఎస్ నాయకులు ధర్మాగౌడ్, బొరొల్ల శ్రీనివాస్, బొరొల్ల జ్యోతి, లక్ష్మణ్, ముత్యం, పండరి పటేల్,తదితరులు పాల్గొన్నారు.