నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 9 : ఎంతో మంది అమరుల త్యాగాలు, పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మే బీజేపీ కుట్రలను యావత్ సమాజం తిప్పి కొట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. మంత్రి నివాసం నుంచి నల్ల జెండాలు, నల్ల మాస్కులు ధరించి బైక్ ర్యాలీ తీశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివాజీ చౌక్, ఈద్గాం, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, బుధవార్పేట్, నగరేశ్వర వార్డు, కలెక్టరేట్ మీదుగా ర్యాలీ తీశారు. శివాజీ చౌక్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంపై అనుచితంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు ముడుసు సత్యనారాయణ, కౌన్సిలర్లు నేరేళ్ల వేణు, గండ్రత్ రమణ, సంపంగి రవి, పోశెట్టి, అయ్యన్నగారి రాజేందర్, నవీన్, ఎస్పీ రాజు, చాహుస్, కోటగిరి అశోక్, నర్సాగౌడ్, ప్రదీప్, శ్రీధర్, గంగారెడ్డి, పద్మాకర్, సుధాకర్, నర్సయ్య, వంశీ పాల్గొన్నారు.