నిర్మల్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): గతంలో పశువులు అనారోగ్యానికి గురైతే సమీప గ్రామాల్లోని పశువుల దవాఖాన కు వెళ్లాల్సి వచ్చేది. మారుమూల గ్రామాల్లోని రైతులు తమ మూగ జీవాలను దవాఖానలకు తీసుకెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రైతుల సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్ర భుత్వం మంద కాడికే వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం సంచార వైద్యశాల వాహనం పంపుతున్నది. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నది. మూగజీవాలకు వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ 2017లో ఈ సంచార పశు వైద్య వాహనాలను ప్రారంభించారు. వైద్యుడు, ఇద్దరు సహాయకులు, పైలెట్తో కూడిన అంబులెన్సులు ప్రస్తుతం నిర్మల్, ఖానాపూర్, ముథోల్ కేంద్రా ల నుంచి సేవలందిస్తున్నాయి. ఆయా కేంద్రాల్లోని అంబులెన్సుల ద్వారా జిల్లాలో 18 మండలాలు, 3 మున్సిపాలిటీల పరిధిలో ఈ సంవత్సరం జనవరి నుంచి ఈనెల 27వరకు 22, 5 30 మూగ జీవాలకు చికిత్స అందించారు. నిర్మల్ కేంద్రం పరిధిలో 9673, ఖానాపూర్ పరిధిలో 7047, ముథోల్ నియోజకవర్గ పరిధిలో 5810 జీవాలకు ఈ సంచార వైద్య శాలల ద్వా రా చికిత్స అందించారు. కేవలం ఒక్క ఫోన్ కాల్తో రైతుల ముంగిటకే వచ్చి పశువులు, గొర్రెలు, మేకలతో పాటు ఇతర మూగ జీవాలకు చికిత్సలు అందిస్తుండడంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అం దించేందుకు టోల్ఫ్రీ నంబర్ 1962 రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
రైతుల చెంతకే సేవలు..
సంచార పశువైద్యంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పశువుల సంరక్షణతోపాటు, పశు సంపదను కాపాడేందుకు సీఎం కేసీఆ ర్ ప్రవేశపెట్టిన ఆధునిక వైద్య సేవలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయి. పశువుల మరణాలను తగ్గించడంతో పా టు వాటికి అవసరమైన చికిత్స కోసం 1962 అంబులెన్సులు పూర్తి స్థాయిలో పని చేస్తూ రైతుల ప్రశంసలను అందుకుంటున్నాయి. రైతులు ఫోన్ చేసిన అరగంటలో మందకాడికి చేరుకుంటున్నాయి. రైతులు తాము నివసిస్తున్న ప్రదేశం, పశువుల సమస్యలు వివరించి ఫోన్ ద్వారా అడ్రస్ చెబితే వెంటనే అంబులెన్సు వారి ఇంటి వద్దకే చేరుకుంటుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు ఈ అంబులెన్సు సేవలు అందుబాటులో ఉంటాయని సంచార పశు వైద్యశా ల జిల్లా ఇన్చార్జి వై మధు తెలిపారు. సంచార వైద్యశాలను జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
లంపీస్కిన్ నుంచి కాపాడిన్రు..
నాకు నాలుగు ఆవులు ఉన్నాయి. నెల రోజుల క్రితం ఒక ఆవుకు లంపీస్కిన్ వైరస్ సోకింది. దీంతో వెంటనే 1962 నంబర్కు ఫోన్ చేసిన. ఇంటి వద్దకే అంబులెన్స్ వచ్చింది. డాక్టర్ శిరీష పరీక్షలు చేసి ఆవుకు ఇంజక్షన్లు ఇచ్చిన్రు. రెండు రోజుల తర్వాత ఇంకో ఆవుకు సోకింది. మళ్లీ వచ్చి చికిత్స చేశారు. 15 రోజుల్లో 8 సార్లు నాకోసమే మా ఊరికి అంబులెన్స్ వచ్చింది. వచ్చిన ఇప్పుడు రెండు ఆవులు పూర్తిగా కోలుకున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా చి కిత్స అందింది. -కే మహేశ్, వాలేగాం, భైంసా మండలం