నిర్మల్ చైన్గేట్, జనవరి 1: కొత్త సంవత్సరం రోజే ఆ కుటుంబంలో తీరని దుఃఖం నిండింది. హైదరాబాద్లో ఉం టున్న కొడుకును చూసేందుకు వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమా దంలో మృతి చెందడం విషాదం మిగిల్చింది. నిర్మల్ పట్టణం లోని బంగల్పేట్కు చెందిన తునికి తులసీదాస్(65), తునికి రాజమణి(60) దంపతుల చిన్న కుమారుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా తమ కొడుకును చూసేందుకు ఆదివారం ఉదయం హైదరాబా ద్ వెళ్లారు. బోయినిపల్లి బస్టాప్ వద్ద రోడ్డు దాటుతుండగా బ స్సు ఢీకొనడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందా రు. కొత్త సంవత్సరం మొదటి రోజే జరిగిన ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. సోమవారం బంగల్పేట్లో అం త్యక్రియలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.