బోథ్, జనవరి 26: బోథ్ నియోజకవర్గంలో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శివరాజ్, పోలీస్ స్టేషన్, సర్కిల్లో సీఐ ముదావత్ నైలు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాథోడ్ రాధ, పంచాయతీ కార్యాలయంలో, గాంధీచౌక్లో సర్పంచ్ సురేందర్యాదవ్, మార్కెట్ యార్డులో కార్యదర్శి రాము, ఐసీడీఎస్లో సీడీపీవో సౌందర్య, అటవీ శాఖలో రేంజ్ అధికారి సత్యనారాయణ, ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ రవీంద్రప్రసాద్, విద్యుత్ కార్యాలయంలో ఏఈఈ జనార్దన్రెడ్డి, సొనాల పీహెచ్సీలో డాక్టర్ నవీన్రెడ్డి, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శంకర్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కన్వీనర్ రుక్మాణ్సింగ్, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో, యువజన సంఘాలు, పాఠశాలల్లో జెండాను ఎగుర వేశారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, జనవరి 26 : రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ మహ్మద్ అతిఖొద్దీన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వామన్భట్ల రాంప్రసాద్, కవ్వాల్ టైగర్ జోన్ కార్యాలయంలో ఎఫ్ఆర్వో వాహబ్ అహ్మద్, ఫారెస్ట్ కార్యాలయంలో ఎఫ్డీవో బర్నోబా, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి రమేశ్, వ్యవసాయ కార్యాలయంలో ఏడీఏ రాంకిషన్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మండలాల కన్వీనర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు, వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో నాయకులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్లో..
గుడిహత్నూర్, జనవరి 26 : తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ పవనచంద్ర, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సునీత, వ్యవసాయ కార్యాలయంలో ఎంఏవో రేవతి, గుడిహత్నూర్, మన్నూర్ పీఏసీఎస్లో చైర్మన్ ముండె సంజీవ్, కరాడ్ ప్రకాశ్, ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ శివాజీ, పశువైద్యశాలలో డాక్టర్ రాథోడ్ జీవన్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎన్ భరత్, జడ్పీటీసీ బ్రహ్మానంద్, సర్పంచ్ జాదవ్ సునీత, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, జనవరి 26 : మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీదేవి, మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో అబ్దుల్సమద్, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవో భూమారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎంఏవో భాస్కర్, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ మహేందర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ తరుణం షబానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లావణ్య, పశువైద్యశాలలో డాక్టర్ సుశీల్కుమార్, సాయిచైతన్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రాజ్కిరణ్రెడ్డి, త్రిదేవి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ నంగె శ్రీనివాస్, కేజీబీవీలో ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీ, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సుదర్శన్, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శులు, స్వచ్ఛంద సంస్థల వద్ద అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
బజార్హత్నూర్ మండలంలో..
బజార్హత్నూర్, జనవరి 26 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కూన గంగాధర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మహేందర్రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అజయ్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో ప్రమోద్రెడ్డి, వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ మేకల వెంకన్న, విద్యుత్ సబ్స్టేషన్లో ఏఈ సందానందం, పశువైద్యాశాలలో డాక్టర్ పర్వేజ్హైమద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హరీశ్, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, జనవరి 26 : భీంపూర్ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సోము, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ , పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాధిక, పీహెచ్సీలో డాక్టర్ విజయసారథి, పాఠశాలలో హెచ్ఎం శిల్ప జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రత్నప్రభ, వైస్ఎంపీపీ గడ్డం లస్మన్న, పశువైద్యాధికారి రాథోడ్ సుభాష్, పీహెచ్సీ సిబ్బంది గంగాధర్, విష్ణు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, రైతు బంధు సమితి ప్రతినిధులు అనిల్, రాథోడ్ ఉత్తమ్, నరేందర్యాదవ్ పాల్గొన్నారు.
తాంసి మండలంలో..
తాంసి తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఆకుల భూమయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ధనశ్రీ, పీఏసీఎస్లో సీఈవో కేశవ్, కళాశాలలో ప్రిన్సిపాల్ సుదర్శన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. పంచాయతీ కార్యాలయాలు, యువజన సంఘాలు, బ్యాంకులలో జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజు, ఎంపీపీ సురుకుంటి మంజుల, వైస్ఎంపీపీ రేఖ, సూపరింటెండెంట్ రవీందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, సర్పంచ్లు స్వప్న, నర్సింగ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్, నాయకులు పాల్గొన్నారు.
తలమడుగులో..
తలమడుగు, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, పార్టీ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ఇమ్రాన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమాకాంత్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రవళిక, ఉన్నత పాఠశాలలో హెచ్ఎం శ్యాంసుందర్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో మహేందర్, పశు వైద్యశాలలో డాక్టర్ దూదూరాం ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ రాహుల్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, పీఏసీఎస్లో సీఈవో మోతే శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్యాణం లక్ష్మి, జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, వైస్ ఎంపీపీ దివ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోక జీవన్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు ఆసం రవి, అభిరామ్ రెడ్డి, రాములు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలో..
సిరికొండ, జనవరి 26: మండలం కేంద్రంతో పాటు రాయిగూడ, రిమ్మ, పొచ్చంపల్లి, సుంకిడి, లచ్చింపూర్, ధర్మసాగర్ గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తహసీల్ కార్యాలయంలో సర్పరాజ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సురేశ్, జడ్పీ ఉన్నత పాఠశాలలో రామకృష్ణ, ప్రైవేట్ పాఠశాల్లో ప్రిన్సి పాళ్లు, పార్టీ కార్యాలయాల్లో ్ట అధ్యక్షులు, గ్రామ పంచాయ తీల్లో సర్పంచ్లు జాతీయ జెండాను ఎగురవేశారు
నార్నూర్, గాదిగూడ మండలాల్లో…
నార్నూర్, జనవరి 26 : నార్నూర్, గాదిగూడ మండలాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు కనక మోతుబాయి, చంద్రకళరాజేశ్వర్, జడ్పీటీసీ మెస్రం గంగుబాయి, వైస్ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, యోగేశ్, సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ సురేశ్, నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.