కడెం, మే 18 : రానున్న వానకాలానికి ప్రాజెక్టులను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. గురువారం కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించి, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. వర్షాలు ప్రారంభం కాకముందు ప్రాజెక్టుకు సంబం ధించిన పనులు పూర్తి చేసి ఎంతటి వరద ప్రవా హం వచ్చినా తట్టుకునేలా పనులు పూర్తి చేయాలని సూచించారు. మరమ్మతు పనుల వివరాలను అధి కారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు సామర్థ్యం, ఆయకట్టు ఎంత వంటి వివరాలను తెలుసుకొని మరమ్మతుల పనులను జూన్ ప్రారం భంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. గతేడాది అధికంగా వచ్చిన వరద ప్రవాహం వల్ల ప్రజలు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. తహసీల్దార్ చిన్నయ్య, డీఈ భోజాదాస్, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు, తదితరులున్నారు.
లీకేజీలకు మరమ్మతు చేపట్టండి
ఖానాపూర్ రూరల్, మే 18 : సదర్మాట్ ఆనకట్ట లీకేజీలకు మరమ్మతు చేపట్టి దిగువ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆదేశించారు. మేడంపల్లిలోని సదర్మాట్ ఆనకట్టను గురువారం సందర్శించారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట రాతిగోడ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ సదర్మాట్ ఆనకట్టను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈఈ రామారావు, ఎంపీడీవో బాలె మల్లేశ్, తహసీల్దార్ రాజమోహన్, డీఈఈ సురేందర్, జేఈ ఉదయ్, మేడంపల్లి సర్పంచ్ రాజేందర్ పాల్గొన్నారు.
బ్యారేజ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
మామడ, మే 18 : బ్యారేజ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. పొన్కల్ గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు పూర్తి చేసిన, చేయా ల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ ఈఈ రామా రావు, తహసీల్దార్ అరిఫా సుల్తానా, ఆర్ఐ నర్సయ్య తదితరులు ఉన్నారు.
స్వర్ణ ప్రాజెక్ట్ సందర్శన..
సారంగాపూర్, మే 18 : వానకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్ అధికారులు స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలకు మరమ్మతు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. స్వర్ణ జలాశయాన్ని అధికా రులతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఆవుట్ ఫ్లో వివరాలు.. ప్రాజెక్టు ఆయ కట్టు.. గేట్ల పని తీరును ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసు కున్నారు. కుడి, ఎడమ కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. ఈఈ రామారావు, డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ సంతోష్రెడ్డి, దేవేంద ర్, మధుపాల్, ఆర్ఐ ముంతాజ్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
సోన్, మే 18 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం అనంతపేట్ గ్రామంలో మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా జిల్లాలో మిషన్ లైఫ్ ద్వారా అన్ని చెరువుల్లో చెత్తాచెదారం తొలగి స్తారని తెలిపారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గిం చాలని, విద్యుత్ శక్తిని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. చెరువుల పరిరక్షణ ద్వారానే జీవన మనుగడ ఆధారపడి ఉంటుందని తెలిపారు. డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో సాయి రాం, ఏపీడీ ప్రసాద్, ఏపీవో తుల రామకృష్ణ, గ్రామ సర్పంచ్ విజయ, తదితరులు పాల్గొన్నారు.