తానూర్, మార్చి 26 : మాది సంక్షేమ సర్కారని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని నిర్మల్ జిల్లా కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ ఆరోపించారు. ఆదివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జవుళా(బి)లో పది పంచాయతీలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలోని చౌరస్తాలో పార్టీ జెండాను ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుకావడం లేదో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అంటగడుతున్నాడని పేర్కొన్నారు.
దేశప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేం ద్రంలోని మోదీ సర్కార్ అడ్డుకుంటున్నదని పేర్కొన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పునాదులని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తల బలంతోపాటు ప్రజాబలం ఉందన్నారు. అదే బలంతో మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమా వ్య క్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా సమస్య పరిష్కారానికి కృషి చేసిన వారే నిజమైన నాయకులన్నారు. ప్రస్తుతం తెలంగాణ దేశానికే పాఠాలు చెప్పే స్థాయికి చేరుకుంటుందన్నారు.
పథకాల గురించి వివరించాలి : ఎమ్మెల్యే విఠల్రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే పార్టీకి బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను విమర్శించే వారికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో సమాధానం చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు 420 గాల్లన్నారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, కేసీఆర్ను, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదన్నారు. ప్రతి కార్యకర్తతోపాటు ఉద్యమకారులకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంగా ఉండి ముందుకు సాగాలన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణరావు పటేల్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతరెడ్డి, మాజీ ఎంపీపీ బాషెట్టి రాజన్న, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యుడు గోవింద్ పటేల్, ఎంపీటీసీ బసవేశ్వర్, తానూర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు విఠల్, సర్పంచ్లు సాయినాథ్, బాలాజీ, బొల్లిపెల్లి బాలాజీ, అబ్దుల్గనీ, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, కేశవ్, సాయినాథ్, పీరాజీ, బిక్చంద్, చంద్రశేఖర్, సాయినాథ్, అట్టల్ దేవిదాస్, మౌలాఖాన్, మాదవ్రావ్ పటేల్ పాల్గొన్నారు.