మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 3 : జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను 102 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డుకు ఎంపిక కాగా, వీరందరికీ డీఈవో యాదయ్య ఆధ్వర్యంలో శనివారం ఆన్లైన్ ద్వారా జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవోమాట్లాడుతూ డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 31 వరకు విద్యార్థులు త యారు చేసిన ప్రాజెక్టుల వీడియోలు, వాటికి సంబంధించిన ఫొటోలు తదితర వివరాలను ఇన్స్పైర్ మనక్ కాంపిటీషన్ యాప్లో నమో దు చేశారు.
వీటిని జాతీయ ఇన్నేవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ప్రతినిధులు అభిలాష్, శు భ్రత్ నేతృత్వంలో స్థానిక, గుజరాత్ రాష్ట్రాల నుంచి న్యాయనిర్ణేతలు సంయుక్తంగా ఈ నెల 1, 2 తేదీల్లో పరిశీలించినట్లు తెలిపారు. వీరిలో పది మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి కి ఎంపిక చేశారు. వీరి పేర్లను జిల్లా సైన్స్ అధికారి మధుబాబుతో కలిసి డీఈవో శనివారం సాయంత్రం వెల్లడించారు.
పొట్లపల్లి నరేష్ (జడ్పీఎస్ఎస్ అచ్చులాపూర్), మైదం స్ఫూర్తి (జడ్పీఎస్ఎస్ అచ్చులాపూర్), తేజావత్ విజయ్ (జడ్పీఎస్ఎస్ కిష్టాపూర్), షేక్ సాధిక్ (మంచిర్యాల జడ్పీఎస్ఎస్ బాలుర), కొమ్మె ర శ్రీవత్స (చిన్నమున్షి స్కూల్, చెన్నూర్), బామండ్లపల్లి హర్షిత (జడ్పీఎస్ఎస్ అచ్చులాపూర్), విఘ్నేశ్వర్ సామాల (జడ్పీఎస్ఎస్ దౌడపల్లి), సుష్మిత (జడ్పీఎస్ఎస్ వీగాం), సైదం రవళి (కేజీబీవీ మంచిర్యాల), అక్కల ప్రశాంత్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఎస్ బాలు ర తాండూరు) ప్రాజెక్టులు ఎంపికయ్యాయని తెలిపారు. వీరందరూ త్వరలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. తమ ప్రాజెక్టును మరింత మెరుగుపర్చుకొని జాతీ య స్థాయికి ఎంపికై రాణించాలన్నారు.