ఇంద్రవెల్లి, డిసెంబర్ 26 : పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార యాత్ర ప్రారంభించారు. ఆదిలా బాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయం(మురాడి)లో మెస్రం వంశీయులు సమావేశం నిర్వహించారు. ప్రచార రథం(ఎద్దుల బండిని) ఏడు రోజులపాటు ఏయే గ్రామాలకు వెళ్లాలో మెస్రం వంశీయుల పీఠాధి పతి మెస్రం వెంకట్రావ్ పటేల్ సమక్షంలో చర్చించారు. పూరాతన నాగోబా ఆలయం (మురాడి)లో సంప్రదాయంగా ప్రత్యేక పూజలు చేసి రథాన్ని సాగనంపారు.
పోలిమేరలో కటోడ కోసేరావ్, ప్రధాన్ మెస్రం దాదారావ్ సంప్రదా య రీతిలో నేలపై తంబాకు, బీడీలు వేసి అక్కడి నుంచి నాగోబాను మొక్కుకున్నారు. తర్వాత ప్రచార రథం(ఎద్దుల బండి)లో కటోడ కోసు, ప్రధాన్ మెస్రం దాదారావ్ కుర్చోని గ్రామాల ప్రచారానికి బయలదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయుల పెద్దలు మాట్లాడుతూ కేస్లాపూర్ నుంచి ప్రారంభమైన ప్రచార రథం (ఎద్దుల బండి) సిరికొండ మండలానికి చేరుకొని గుగ్గిల స్వామి ఇంటికి వెళ్లి పూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆదేశాలు ఇచ్చారు. 26న సాయంత్రం రాజంపేట్ గ్రామానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారని వివరించారు. 27న గుడిహత్నూర్ మండలం సోయంగూడ, 28న ఇంద్రవెల్లి మండలం గిన్నెర, 29న ఉట్నూర్ మండలం సాలేవాడ, 30న ఇంద్రవెల్లి మండలం వడ్గాం, 31న వడ్గాం నుంచి కేస్లాపూర్ గ్రామానికి చేరుకుంటారని పేర్కొన్నారు.
కేస్లాపూర్లోని మెస్రం వంశీయుల పెద్దవాడైన మడావి ఇంట్టి వద్ద రాత్రి బస చేస్తారని తెలిపారు. జనవరి 1న గ్రామంలోని పూరాతన నాగోబా ఆలయం(మురాడి)లో ప్రత్యేక పూజలు చేసి పవిత్రమైన గంగాజలం సేకరించడానికి పాద యాత్రగా బయలు దేరి వెళ్లనున్నారు. కార్యక్ర మంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ పటేల్, మెస్రం వంశీయులు చిన్ను పటేల్, బాజీరావ్పటేల్, కోశరావ్ కటోడ, కోసు కటోడ, దాదారావ్, లింబారావ్, దేవ్రావ్, నాగోరావ్, హనుమంత్రావ్, గణపతి, తిరుపతి, నాగ్నాథ్, ఆనంద్రావ్, జంగుబాపు, తుకారాం, మెస్రం షేకు, సీతారామ్, ధర్ము, మారుతి, కార్తీక్ పాల్గొన్నారు.
ప్రచార రథం కార్యక్రమంలో జడ్పీ చైర్మన్..
కేస్లాపూర్ నుంచి గ్రామాల ప్రచారానికి బయ లుదేరిన ప్రచార రథం కార్యక్రమంలో ఆదిలా బాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. నాగోబా జాతర ఏర్పాట్ల తోపాటు గంగాజలం సేకరణపై గ్రామాల్లో ఏడు రోజులు ప్రచారం నిర్వహించే ప్రచార రథం ప్రారంభించే కార్యక్రమంలో మెస్రం వంశీయుల ను మార్గాలపై అడిగి తెలుసుకున్నారు. నాగోబాకు నిర్వహించే మహాపూజలతో పాటు గంగాజలానికి వెళ్లే పాదయాత్రకు సంబంధించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీ యులు తదితరులు పాల్గొన్నారు.