రేవంత్రెడ్డి.. నీకు ఎవుసం గురించి తెలుసా? ఎప్పుడైన పొలం వద్దకు వెళ్లినవా? రైతులతో మాట్లాడిన ముఖమేనా? ఏసీ గదుల్లో కూర్చొని ఏదో రాసుకచ్చుకొని సదివితే కుదరదు. మా బాధలు తెలియాలంటే చేల వద్దకు రా.. రోజంతా మాతో ఉండు. మేం పడే కష్టాలు తెలుస్తవి. మోటారు కరాబైతే, కరెంటు పోతే, ఎడ్లు సతాయిస్తే గప్పుడు అసలు ఎవుసం అంటే ఏమిటో అర్థమైతది. మీ కాంగ్రెసోళ్ల హయాంలో తొమ్మిది గంటలే కరెంటు ఇచ్చేది.
రాత్రంతా బాయిల కాడ దోమలు కుట్టంగ, పాములు, తేళ్ల మధ్య ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పడుకునేది. నా తోటోళ్లు కరెంటు షాక్, విష ప్రాణులు కుట్టి చనిపోయిండ్రు. గిప్పుడు కేసీఆర్ సారు 24 గంటల కరెంటు ఇస్తుంటే.. ఆరామ్సే మోటార్ పెట్టొచ్చి.. రాత్రంతా ఇంట్లో పడుకుని పొద్దున పోయే వరకు పొలం పారుతున్నది. గప్పట్ల కరెంటు, నీళ్లు లేక ముజ్గిలో ఇద్దరు ముగ్గురు రైతులే వడ్లు పండించేటోళ్లు. గిప్పుడైతే ఇరవై నుంచి ముప్పై లారీల వడ్లను పండిస్తున్నరు. ఇంతకంటే ఏం కావాలి.. ఇంకోసారి మా గురించి, ఉచిత కరెంటు గురించి నోరు పారేసుకుంటే ఊరుకోం.. తప్పుడు కూతలు కూసినవ్ కదా ముక్కు నేలకు రాయ్. తప్పయిందని ఒప్పుకో.