భైంసా, అక్టోబర్ 29 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని సంజీవ్రెడ్డి ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ, సాగు, తాగు నీరు, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, గృహలక్ష్మి వంటి పథకాలు పేదల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను దీవించాలని కోరారు.
ఈ నెల 3న శుక్రవారం ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని, దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు సీఎం కేసీఆర్ రానున్నారని మధ్యాహ్నం 1 గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముథోల్ నియోజకవర్గంలోని నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళిగౌడ్, సంజీవ్రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ప్రధాన కార్యదర్శి తోట రాము, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, ఆళా, ఖాలీద్, భోజరాం, సూరి, దేవిదాస్, రాజు, యశ్వంత్ బన్సోడే ఉన్నారు.