ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ రాష్ట్రస్థాయిలో మెరిసింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 అవార్డు లభించింది.
ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా గురువారం ఆ గ్రామ సర్పంచ్ తుంరం భాగుబాయి అవార్డు అందుకున్నారు.
– ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 14