నిర్మల్, జూలై 1(నమస్తే తెలంగాణ):స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తుండడంతో, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. రూ.6.50 కోట్లతో నిర్మల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్ను శ నివారం మంత్రి హరీష్రావు వర్చువల్గా ప్రారంభించారు. స్థానిక జిల్లా ప్రధాన దవాఖాలోని రేడియాలజీ హబ్లో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వరుణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మం ది ప్రాణాలు కాపాడిన వైద్యులు, వైద్య సిబ్బందికి డాక్టర్స్ డే సంద ర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో మూడు మంచి కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్ని టీ-డయాగ్నోస్టిక్ హబ్ల ద్వారా 57రకాల పరీక్షలను చేశామని, ఇకపై 134 రకాల పరీక్షలను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా చేస్తారని తెలిపారు. కొత్తగా పెంచిన పరీక్షల్లో ముఖ్యంగా ఎనీమియా, సర్జికల్ ప్రొఫైల్, తలసేమియా సికిల్సెల్ టెస్టు, హిమోఫీలియా టెస్టు, క్యాన్సర్ సంబంధిత పరీక్షలు, హార్మోన్స్, హెపటైటిస్, హెచ్ఐవీ, వైరల్ లోడ్ టెస్టులు, యాంటీ బ్యాక్టీరియల్ తదితర అనేక రకాల పరీక్షలు ఉన్నా యన్నారు. ఇవే పరీక్షలు ప్రైవేటులో చేయించుకుంటే వెయ్యి నుంచి రూ. 10వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో నయా పైసా ఖర్చు లేకుండా అదే క్వాలిటీ పరికరాల ద్వారా అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేసే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రతి జిల్లాలో ఒక టీ- డయాగ్నోస్టిక్ సెంటర్, రేడియాలజీ ల్యాబ్ పెట్టాలని.. తద్వారా హైదరాబాద్లో ఎలాంటి వైద్య సేవలు దొరుకుతాయో, అదేవిధంగా మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో టీ-డయాగ్నోస్టిక్ హబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 16 రేడియాలజీ ల్యాబ్లను శనివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిర్మల్లో కూడా కొత్తగా ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్లో ప్రజలు ఈ రోజునుంచి ఈసీజీ, 2-డీ ఎకో, సీటీ స్కాన్, మె మోగ్రఫీ, ఎక్స్రే తదితర పరీక్షలను పూర్తి ఉచితంగా చేసుకోవచ్చన్నా రు. ఆయా పరీక్షల ద్వారా పేదలకు వ్యాధి నిర్ధారణ పరీక్షల భారం తగ్గుతుందన్నారు. గతంలో ఖర్చుకు భయపడి కొంత మంది ఈ పరీక్షలను వాయిదా వేసుకునే వారని, దీంతో వ్యాధి ముదిరిపోయి, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తేవని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తుండటంతో తొందరగా వ్యాధిని గుర్తించి, వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందించే అవకాశం కలిగిందన్నారు. ఇలా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తేవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ టీ-డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 57లక్షల మంది ప్రజలకు సంబంధించి 10కోట్ల 40లక్షల పరీక్షలను చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో పాటు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తరచూ పీహెచ్సీలను సందర్శించి ఓపీ వివరాలతో పాటు ప్రతి రోజు ఎన్ని పరీక్షలు చేస్తున్నారనే విషయాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్న వైద్య సదుపాయాల గురించి ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి, వారు ఉచితంగా సేవలు పొందేలా చూడాలన్నారు. అలాగే గర్భిణులకు సకాలంలో న్యూట్రీష న్ కిట్లు అందేలా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్తో కలిసి జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి రిబ్బన్ కట్ చేసి రేడియాలజీ హ బ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.దేవేందర్రెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ వేణుగోపాలక్రిష్ణ, డిప్యూటీ డీఎంఅడ్హెచ్వో డాక్టర్ రాజేందర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, డీఐవో నయనారెడ్డి, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, టీ-డయాగ్నోస్టిక్ వైద్యులు కీర్తి, ఇన్చార్జి మధు, డాక్టర్ చిం తపండు రవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.