మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 14 : జిల్లాలోని ఐదు (మంచి ర్యాల, దండేపల్లి, కాసిపేట, కోటపల్లి, మందమర్రి) మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను ఈ నెల 16వ తేదీన విద్యాశాఖ అధి కారులు నిర్వహించనున్నారు. ఆరో తరగతి పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరగనున్నది.
ప్రవేశానికి 2,976 మంది దరఖాస్తు..
జిల్లావ్యాప్తంగా 2,976 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆరో తరగతికి 1,649 మంది దరఖాస్తు చేసుకోగా, ఏడో తరగతికి 570 మం ది, ఎనిమిదో తరగతికి 429, తొమ్మిదో తరగతికి 260, పదో తరగతికి 68 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసు కున్నారు.
జిల్లా వ్యాప్తంగా పది పరీక్ష కేంద్రాలు…
జిల్లా వ్యాప్తంగా మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంచిర్యాలలోని రాజీవ్నగర్లో గల మోడల్ స్కూల్, జడ్పీ బాలుర హైస్కూల్, జడ్పీ బాలికల హైస్కూల్, చెన్నూర్ రోడ్ ప్రభుత్వ పాఠశాలతో పాటు దండేపల్లి మండలంలోని అల్లీపూర్ మోడల్ స్కూల్, కాసిపేట మోడల్ స్కూల్, మంమదర్రిలోని మోడల్ స్కూల్, కార్మల్ కాన్వెంట్ హైస్కూల్, సింగరేణి హైస్కూల్, కోటపల్లిలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
హాల్టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి
జిల్లాలోని ఐదు మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష రాసే 2,976 విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ (telan ganams. cgg. gov.in) నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. కొవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలి. విద్యార్థులకు ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి, మంచిర్యాల