ముథోల్, ఏప్రిల్ 19 : మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముథోల్లోని జీఎం ఫంక్షన్ హా ల్లో బుధవారం ముస్లింలకు తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు కానుకలు అందజేస్తున్నదని వెల్లడించారు. ప్రజలందరూ కలిసి ఆనందంగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అ యేషా అఫ్రోజ్ ఖాన్, తహసీల్దార్ తుకా రాం, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎంపీటీసీలు దేవోజీ భూమేశ్, సరళ- శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యు డు ఖాలీద్, నాయకులు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
భైంసాటౌన్, ఏప్రిల్ 19 : మండలంలోని దేగాంలోని తన నివాసంలో కుంటాల మండలానికి చెందిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కుంటాల మండలానికి చెందిన బీ గౌతమికి రూ.10,500, నర్సాపూర్ మండలం గొల్లమాడకు చెందిన ఏ లక్ష్మి కి రూ.16 వేలు, కవితకు రూ.12 వేలు, పీ సంతోష్కు రూ.15 వేలు, రాజాపూర్ గ్రామానికి చెందిన ఆర్ బాలుకు రూ.12 వేలు, ఓలా గ్రామానికి చెందిన ఏ రవీందర్కు రూ.12 వేలు, షేక్ నజీర్ హైమద్కు రూ.6 వేలు, కే రాకేశ్కు రూ.9,500, ఫర్జానాకు రూ.18 వేల విలువైన చెక్కులు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరయ్యాయి. వీటిని బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగాధర్, కుంటాల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్, అందకూర్ సర్పంచ్ కిషన్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, హైమద్ పాషా, ఖాదీర్, రమేశ్, శివ, శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
భైంసా మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్గా చిలింకర్ గంగాధర్ నియమితులైన సందర్భంగా ఆయన ఎమ్మెల్యే విఠ ల్ రెడ్డిని దేగాంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పూలమాలతో సన్మానించి మిఠాయి తినిపించారు. ఏఎంసీ డైరెక్టర్గా నియమించినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డి కూడా గంగాధర్ను సన్మానించారు. కుభీర్ మండలం కుప్టి సర్పంచ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిధులు మంజూరు చేయాలని వినతి
కుంటాల, ఏప్రిల్ 19 : మండలంలోని మెదన్పూర్ జడ్పీ రోడ్డు నుంచి మహాదేవ్ తండా వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి-బుచ్చన్న ఆ ధ్వర్యంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యపూర్ సర్పంచ్ సునీత-భోజన్న, ఆత్మచైర్మన్ అశోక్ రెడ్డి, మెదన్పూర్ మాజీ సర్పంచ్ చిన్న రాజన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.