తానూర్, అక్టోబర్ 5 : నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో 31 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఇందులోని 12 జీపీలతో బెల్తరోడాను మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బెల్తరోడ గ్రామస్తులు, మండల అధ్యక్షురాలు, జడ్పీ వైస్ చైర్మన్తో కలిసి ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మంత్రి అల్లోలను కలిసి వినతిపత్రం అందించారు. ఇటీవల ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఐకే రెడ్డిలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. గత మంగళవారం బెల్తరోడ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మండలంలో బెల్తరోడ, భోసి, మహాలింగి, బామ్ని, బామ్నితండా, బొంద్రట్, ఝరి(బీ), ఝరి(బీ) తండా, బోల్సా, బోరిగాం, బెంబర్, ఉమ్రి(కే)లు ఉన్నాయి.
విఠల్రెడ్డిని మరువం..
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే విఠల్రెడ్డి బెల్తరోడ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయించారు. ఆయన ఒకసారి మాటిస్తే తప్పడు. గ్రామస్తులు ఎమ్మెల్యే విఠల్రెడ్డిని ఎప్పుడు మరువరు. వారి వెంటే మేం ఉంటాం. మండలం ఏర్పాటుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు.
– బండారే పోశెట్టి, బీఆర్ఎస్ నాయకుడు, బెల్తరోడ.
మంత్రి, ఎమ్మెల్యే కృషి వల్లే..
మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి కృషి వల్లే బెల్తరోడ మండలంగా ఏర్పాటైంది. ఐదు రోజుల క్రితం హైదరాబాద్లో ఐకే రెడ్డిని కలిసి బెల్తరోడ మండలం విషయంలో మాట్లాడాం. అల్లోల కూడా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేశారు. మండలం ఏర్పాటుకు కృషి చేసిన మంత్రివర్యులు తారక రామారావు, ఐకే రెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డికి కృతజ్ఞతలు.
– బాశెట్టి సాగరబాయి, జడ్పీ వైస్ చైర్మన్.
ప్రత్యేక ధన్యవాదాలు
2016 నుంచి బెల్తరోడను మండలంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తు న్నాం. ముథోల్ ఎమ్మెల్యే మాకు ఇచ్చిన మాట ప్రకారం ఏర్పాటు చేయించారు. మండలం ఏర్పాటుకు సహకరించిన మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక నాయకులకు రుణపడి ఉంటాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
– గోప సాయినాథ్, సర్పంచ్, బెల్తరోడ.