తానూర్, అక్టోబర్, 18 : బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని బీఆర్ఎస్ ముథోల్ అభ్యర్థి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పోచమ్మ, మహాలక్ష్మి, సాయిబాబా, మల్లన్న ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, తానూర్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్రెడ్డికి తానూర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు విఠల్ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్తున్నదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రజలు మూడోసారి పట్టం కట్టడం ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి మాయమాటలతో మోసం చేసేందుకు అనేక హామీలను గుప్పిస్తారని వాటనింటినీ నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.
తానూర్తో పాటు మండలంలోని ఎల్వత్, వడ్గావ్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు 150 మంది బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే విఠల్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడేవార్ విఠల్, భైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్, సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోతరెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, మాజీ జట్పీటీసీ ఉత్తం బాలేరావ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, గోవింద్పటేల్, శ్రీనివాస్రెడ్డి, దత్తురాంపటేల్, తదితరులు పాల్గొన్నారు.