కడెం, జూలై 22: కడెం ప్రాజెక్టుకు భారీ వరద నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని సీఎం కేసీఆర్ను సచివాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ వివరించారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు సంబంధించిన విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అధికారులతో మాట్లాడి, పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు.
సీఎంతో పాటు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మంత్రి ఇల్లోల ఇంద్రకరణ్రెడ్డిని కలిసి పలు సమస్యలను విన్నవించారు. కడెం మండలంలోని గంగాపూర్-పస్పుల వంతెనకు నిధులు మంజూరు చేసి ఆ గ్రామాల సమస్యలను తీర్చాలని, ఖానాపూర్లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే దంపతులతో పాటు, సర్పంచులు, ఎం పీటీసీలు, స్థానిక నాయకులు, తదితరులున్నారు.