తలమడుగు, మార్చి 27 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్రి గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.
గ్రామంలో ర్యాలీగా సభా స్థలికి చేరుకున్నారు. ముందుగా కుమ్రం భీం, గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ దివంగత పెందూర్ లక్ష్మణ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. గిరిజన గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. ప్రతి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఆదివాసీ గ్రామాలకు మిషన్ భగీరథ నీరందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేశామన్నారు. త్వరలో మహారాష్ట్ర సరిహద్దు అయిన గోగర్వడి వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. బోథ్ నియోజకవర్గంలో అందరి సహకారంతో అభివృద్ధి చేశామన్నారు.
ఉమ్రిలోని సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను విడుతలవారీగా పరిష్కరించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. సర్పంచ్ గోపాల్, డీసీసీబీ డైరెక్టర్ వనమాల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు స మితి అధ్యక్షుడు జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కిరణ్, మాధవ్రావ్, రాంబాయి, సునీత రెడ్డి, ఆశన్న యాదవ్, ప్రకాశ్, వెంకట్రెడ్డి, లక్ష్మణ్ పాండు, జనపటేల్ పాల్గొన్నారు.