న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతీయ అంతర్జాతీయ వైమానిక రంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ వార్ వల్ల భారతీయ వైమానిక సంస్థలకు చెందిన సుమారు 26 వేల విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల ఊహించని రీతిలో ఆదాయం నష్టపోయినట్లు ఇవాళ పార్లమెంట్(Parliament)లో ప్రభుత్వం పేర్కొన్నది. జూలై 20వ తేదీ నాటికి దాదాపు 26 వేల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రభుత్వం చెప్పింది. విమానాల దారిమళ్లింపు వల్ల నష్టం మరింత పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభ ఎంపీ ఆంటో ఆంటోనీ వేసిన ప్రశ్నకు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురలీధర్ మోహల్ సమాధానం ఇచ్చారు.
విమానాలపై ఆంక్షల వల్ల ఎక్కువ శాతం విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్నింటిని దారిమళ్లించారని, కొన్ని విమానాశ్రయాల్లో ఆలస్యం జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే ఏ విమాన సంస్థకు, ఏ విమానాశ్రయానికి ఎంత నష్టం వచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. విమానశాఖపై ఇరాన్ యుద్ధం ప్రభావం పడకుండా ఉండేందుకు .. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సుమారు 10వేల కోట్ల బడ్జెట్ను మద్దతుగా అందజేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.