బోథ్, మే 13 : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 67 మంది లబ్ధిదా రులకు రూ 17,10,500 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కోసం ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు. 40 శాతం వరకు ప్రభుత్వం భరించి అండగా నిలుస్తున్న దన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సీఎంఆర్ఎఫ్ కింద ఎవరికి సాయం అందేది కాదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ పేదవానికి సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందు తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, సర్పంచ్ సురేందర్ యాదవ్, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆపదలో ఆపన్నహస్తం సీఎం కేసీఆర్
గుడిహత్నూర్, మే 13 : పేద వారికి ఆపదలో ఆపన్నహస్తంల కేసీఆర్ ఉన్నాడని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండలం సీతాగోంది గ్రామానికి చెందిన ఎన్ సుభాష్కు రూ.11వేలు, జీడిపల్లె గ్రామానికి చెందిన సిడ్మాకి లచ్చుకు రూ.48వేలు సీఎం ఆర్ఎఫ్ కింద వైద్య ఖర్చులకు డబ్బులు మంజూరయ్యాయి.జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో శనివారం లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహా యం అందజేసి వారికి అండగా ఉంటుం దన్నా రు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అరుగుల సంతోష్గౌడ్,నాయకులు పాటిల్ రాందాస్, కాడే నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
తాంసిలో..
తాంసి, మే 13 : మండలంలోని గిరిగామ, తాంసి, వడ్డాడి, హస్నాపూర్, బండల్ నాగపూర్, జామిడి, కప్పర్ల గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధ్దిదారులకు రూ.2 లక్షల 10 వేలు విలువ గల చెక్కులను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అందిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడు తున్న వారు ఉంటే సీఎంఆర్ఎఫ్ ద్వారా తాము ఆదుకుంటామని పేర్కొన్నారు. ఎంపీపీ సుర కుంటి మంజుల శ్రీధర్ రెడ్డి, రాథోడ్ బాపురావ్ యువసేన జిల్లా అధ్యక్షుడు మెంచు కాంతారావ్, సర్పంచ్లు స్వప్న రత్నప్రకాశ్, సదానందం, వెంకన్న, తూర్పుబాయి, అలాలి జ్యోతి నర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్ పాల్గొన్నారు.